ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 14, 2021, 4:57 PM IST

ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత.. పది మంది అరెస్ట్

గుంటూరు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ. 8 లక్షల 41 వేల విలువ చేసే.. 100 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Seizure of illicit liquor in Narasaraopet Guntur district
భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.. పది మంది అరెస్ట్..

అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు రోడ్డులో జొన్నలగడ్డ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. సిమెంట్ లారీలో తరలిస్తున్న మద్యాన్ని.. మరో 3 కార్లలోకి మారుస్తుండగా గుర్తించారు.

వారిని అడ్డుకున్న పోలీసులు.. 100 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ సుమారు రూ. 8 లక్షల 41 వేలు ఉంటుందని తెలిపారు. మూడు కార్లను సీజ్ చేసి, పది మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని నరసరావుపేట ఎస్సై పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details