ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకి.. తాడికొండలో ఎస్​బీ ఏఎస్​ఐ మృతి - thadikonda latest news

గుంటూరు జిల్లా తాడికొండలో ఎస్​బీ ఏఎస్​ఐ కరోనాతో మృతి చెందారు. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.

sb asi
ఎస్​బీ ఏఎస్​ఐ తోకల శివయ్య

By

Published : May 11, 2021, 9:19 PM IST

గుంటూరు జిల్లా తాడికొండలో ఎస్​బీ ఏఎస్​ఐగా పనిచేస్తున్న తోకల శివయ్య (50) మృతి చెందారు. ఇటీవల కరోనా సోకిన ఏఎస్​ఐ.. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఎన్నారై ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. జిల్లాలోని చుట్టుగుంటకు చెందిన శివయ్య.. 1990లో కానిస్టేబుల్​గా ఉద్యోగంలో చేరారు.

మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, గుంటూరు, మంగళగిరి, తుళ్లూరులో పనిచేశారు. మరణానికి ముందు వరకూ తాడికొండలో పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీపీఐ మండల కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్ రావు, సీపీఎం మండల కార్యదర్శి చింతల భాస్కర్​రావు మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. శివయ్య అంత్యక్రియల్లో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details