ఓట్ల లెక్కింపుతో ఆధిక్యం పలుమార్లు చేతులు మారడంపై అభ్యర్థి, మద్దతుదారులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీ విషయంలో ఈ ఆందోళన జరిగింది. మొదట చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఒక్క ఓటు ఆధిక్యంతో గోవిందమ్మ గెలిచినట్లు ప్రకటించారు. ప్రత్యర్థి కొమ్మనబోయిన ఇందిర.. రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టడంతో వీఆర్వో ఆదేశాలలో సిబ్బంది రెండోసారి ఓట్లు లెక్కించారు. ఈసారి గోవిందమ్మకు 24 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇరు వర్గాలు పరస్పరం వాదులాడుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడోసారి నిర్వహించిన ఓట్ల లెక్కింపులో గోవిందమ్మకు మళ్లీ 24 ఓట్ల ఆధిక్యత లభించింది. ఎంపీడీవో రాధాకృష్ణ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఆర్వోతో మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నాలుగోసారి చేపట్టిన లెక్కింపులో గోవిందమ్మ 30 ఓట్ల ఆధిక్యం సాధించడంతో ఆమె గెలుపును ప్రకటించారు.
న్యాయం చేయాలని..