బంధువుల ఇంటికి వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి
సరిలేరు నీకెవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తన కెరీర్లోనే ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన హీరో మహేష్ బాబును ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎఫ్2తో రూ.80 కోట్లు షేర్ రాగా ఈ చిత్రంతో రూ.130 కోట్లు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
సరిలేరు నీకెవ్వరూ సినిమా పై హర్షం వ్యక్తం చేస్తున్న దర్శకుడు అనీల్