ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోటి కార్మికుడికి న్యాయం చేయాలని.. రోడ్డెక్కిన పారిశుధ్య కార్మికులు

గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత ఆదివారం ఓ పారిశుధ్య కార్మికుడు మరణించగా.. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

By

Published : Nov 3, 2021, 11:52 AM IST

Sanitation workers protest
సచివాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు ఆందోళన


గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు. గత ఆదివారం సచివాలయంలోని ఐదో బ్లాక్​లో ఓ పారిశుధ్య కార్మికుడు రాజేంద్రప్రసాద్ మృతిచెందారు. ఈ నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు.

విధులు బహిష్కరించి రోడ్డు పక్కనే కూర్చుని నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు వారితో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించేవరకూ కదలబోమని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details