Samagra Shiksha Abhiyan Talks With Officials Failed: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఐకాస నేతలు ప్రకటించారు. ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారితో ఉద్యోగ సంఘం నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏ సమస్యకూ స్పష్టమైన హామీ రాకపోవడంపై ఉద్యోగ సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులు కమిటీతో చర్చించిన మీదటే నిర్ణయం వెల్లడిస్తామంటూ అధికారులు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఆందోళన సందర్భంగా ఇప్పటి వరకు 670 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్ఎస్ఏ ఉద్యోగ సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్ఎస్ఏ జాక్ తెలిపారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరపు ప్రతినిధులు ఎమ్మెల్సీ వై.వి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రితో త్వరలోనే చర్చలు ఏర్పాటు చేస్తామని అన్నారు. హెచ్ఆర్ పాలసీకు సంబంధించి హామీ వచ్చిందని, ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. మంత్రి వద్ద మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమ్మెకాలంలో ఇచ్చిన నోటీసులకు సమాధానం సమ్మె విరమణ తరువాతే చెబుతామన్నారు. సమ్మె విరమణ అయ్యే వరకు ఎవ్వరూ విధులకు హాజరు కావద్దని సూచించారు. తమ సమస్యల పరిష్కారం చేస్తే తాము సమ్మెలోకి వెళ్లే వాళ్లం కాదని అన్నారు.
14వ రోజు ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
అంతకుముందు విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రం నలుమూలల నుంచి సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు.