అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ: సజ్జల రామకృష్ణారెడ్డి
పదేళ్లలో జరిగే అభివృద్ధిని వచ్చే మూడేళ్లలో చేసి చూపించేందుకే పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రూపొందించిన ప్రచార రథాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో జెండా ఊపి సజ్జల ప్రారంభించారు. వైకాపా ఎన్నారై విభాగం బాధ్యులు ఈ ప్రచార రథంలో తిరిగి ప్రజల్లో అపోహాలను తొలగిస్తారని రామకృష్ణారెడ్డి వివరించారు.
మూడు రాజధానులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య
TAGGED:
latest news on three capital