ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట డిపో నుంచి బస్సులు ఇలా నడుస్తాయి..!

గుంటూరు జిల్లా నరసరావుపేటలో బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ అబ్ధులా సలాం తెలిపారు. ప్రయాణికులు భౌతికదూరం పాటిస్తూ... తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బస్సులు బయలుదేరే వివరాలిలా ఉన్నాయి.

By

Published : May 20, 2020, 11:55 PM IST

rtc buses are started from tomarrow on wards  the details of guntur dst narsaraopeta depo dre given bellow
rtc buses are started from tomarrow on wards the details of guntur dst narsaraopeta depo dre given bellow

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరణ చేయనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్సులలో ప్రయాణికులకు కరోనా సోకకుండా ఉండే విధంగా సీట్టింగ్ విషయంలో తగుజాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నరసరావుపేట నుంచి గుంటూరుకు 3 నాన్ స్టాప్ బస్సులు, పల్లెవెలుగు 3 బస్సులు, పిడుగురాళ్ళకు 2 పల్లెవెలుగు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మాచర్ల నుంచి నరసరావుపేట స్టేజ్ ఉండేలా చిలకలూరిపేటకు, సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకు బస్సులు తిరగనున్నట్లు ఆయన వివరించారు.

ప్రయాణికులు బస్టాండుకు వచ్చి క్యూలైన్లలో భౌతికదూరం పాటించి టిక్కెట్ కొనుగోలు చేయాలని సూచించారు. డ్రైవర్ మాత్రమే బస్సులో ఉంటారు. కాబట్టి బస్సులలో టిక్కెట్లు ఇవ్వరని స్పష్టం చేశారు.

ఇదీ చూడండిప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించకపోతే ఎలా..?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details