ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారును తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు.. పక్కనే ఉన్న ఇనుప సామాన్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

By

Published : Jan 18, 2021, 2:55 PM IST

rtc bus accident
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

దారికి అడ్డంగా వచ్చిన కారుని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న ఇనుప సామాన్ల దుకాణంలోకి దూసుకెళ్లడంతో అక్కడ కాపలాగా ఉన్న బెల్లంకొండ స్వామి(35) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం:

ఒంగోలు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 39 మంది ప్రయాణికులతో విజయవాడకు వెళ్తోంది. ఈ క్రమంలో చిలకలూరిపేటలోని బస్టాండ్ ఎదురుగా హఠాత్తుగా కారు అడ్డుగా వచ్చింది. తప్పించే క్రమంలో బస్సును పక్కకు తిప్పడంతో సమీపంలోని ఇనుప సామాను దుకాణంలోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అది కూడా విరిగి పడింది. ఈ ఘటనలో షాపు వద్ద కాపలాగా ఉన్న బెల్లంకొండ స్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం విరిగిపడిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details