ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేసిన రోటరీ క్లబ్

గుంటూరు జిల్లా తెనాలిలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి చెందిన నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేశారు.

By

Published : Jul 14, 2020, 10:56 PM IST

Published : Jul 14, 2020, 10:56 PM IST

roatary club
తెనాలి వైద్యలుకు పీపీఈ కిట్లు అందజేసిన రోటరీ క్లబ్​

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యుల సేవలు ప్రశంసనీయమని... గుంటూరు జిల్లా తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు అన్నారు. తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2020-21 నూతన కార్యవర్గ సభ్యుల నియామక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు 1 లక్ష 70 వేల విలువ చేసే వెయ్యి పీపీఈకిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ చేతులు మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ శనత్​కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా వంటి సమయంలో రోటరీ క్లబ్​ వారు ముందుకు రావటం అభినందనీయమన్నారు.

ఇదీ చదవండి:డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా?

ABOUT THE AUTHOR

...view details