ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

మహిళపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను నేర విభాగం ఏఎస్పీ రాఘవ వివరించారు.

By

Published : Jul 18, 2019, 10:36 PM IST

తాడికొండలో మహిళపై అత్యాచారం, దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

తాడికొండలో మహిళపై అత్యాచారం, దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కులలో ఓ మహిళపై అత్యాచారం చేసి నగదు దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ సైతం ఉంది. జులై 2వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నిడుముక్కల వద్ద ఓ మహిళ ఆటో కోసం వేచి చూస్తోంది. దీన్ని గమనించిన ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులు, భార్యతో కలిసి ఆటోలో ఎక్కించుకున్నారు. తాను దిగవలసిన ప్రాంతం దాటి పోవడంతో మహిళ గట్టిగా కేకలు పెట్టింది. కేకలు వినిపించకుండా ఉండేందుకు.. ఎక్కువ సౌండ్​తో పాటలు పెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కత్తితో బెదిరించి బంగారు గొలుసు, నగదును లాక్కున్నారు. తర్వాత ఆటో డ్రైవర్ రమేష్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details