గుంటూరు జిల్లా అన్నంబోట్ల వారి పాలెం వద్ద కూలీలతో వెళ్తున్న ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో 15మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కూలీలు చిలకలూరి పేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.
లారీని ఢీకొన్న ఆటో.. ఒకరు మృతి, పలువురికి గాయాలు - అన్నంబోట్ల వారి పాలెం రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని అన్నంబోట్ల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం