గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలోని జంగంగుంట్ల పాలెం వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. అటుగా వస్తున్న ఆటో ద్విచక్రవాహనాన్ని తప్పించిబోయి పక్కన ఉన్న లంకలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మెడికొండ్రు పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
కారు-ద్విచక్రవాహనం ఢీ.. బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా - గుంటూరు జిల్లా మెడికొండ్రు
ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ ఆటో లంకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలో ఈ ఘటన జరిగింది.
![కారు-ద్విచక్రవాహనం ఢీ.. బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8077996-549-8077996-1595077214810.jpg)
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఐదుగురికి గాయాలు