ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు - road accident in guntur and alluri district nrews

రాష్ట్రంలో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదం
వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదం

By

Published : May 29, 2022, 12:28 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం కటేవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అఖిల్, విశ్వనాథ్​లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆడారిమెట్ట వద్ద ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details