గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో శేషు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు... బైక్ని ఢీకొట్టి, అదే వేగంతో వెళ్లి డివైడర్ పైనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకింది. దీంతో ఆ విద్యుత్ స్తంభం కూలిపోయి మరో కారుపై పడింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.
మంగళగిరి వద్ద ప్రమాదం... ఒకరు మృతి, నలుగురికి గాయాలు - mangalagiri latest news
గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా...నలుగురు గాయపడ్డారు.

accident
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గుంటూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను విజయవాడలోని రాజ్భవన్లో ఫుడ్సెక్షన్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
ఇదీ చదవండి:విషాదం: కృష్ణా నదిలో మునిగి.. ముగ్గురు యువకులు మృతి