ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో తెలంగాణ ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి - accident news

గుంటూరులో తెలంగాణ ఆర్టీసీ బస్సు కింద పడి ఏసుదాసు అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నడుపుతుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

road accident in guntur
గుంటూరులో తెలంగాణ ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

By

Published : Apr 10, 2021, 10:54 PM IST

తెలంగాణ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి విజయవాడకు చెందిన ఏసుదాసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆటోనగర్ సమీపంలో జరిగింది. మృతుడు తమ బంధువుల వ్యక్తి మృతి చెందడంతో.. దానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా కార్డులు పంచేందుకు గుంటూరు వచ్చాడు.

ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్​లోకి తిరుగుతుండగా.. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీకి చెందిన మణుగూరు నుంచి కనిగిరి వెళుతున్న బస్సు అదే దారిలో వచ్చింది. దానిని గమనించి తప్పించే క్రమంలో ఏసుదాసు నడుపుతున్న ద్విచక్రవాహనం కిందపడ్డాడు. ఆ సమయంలో బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో ఏసుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. పెదకాకాని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details