ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది: రేషన్ డీలర్లు - గుంటూరులో రేషన్ డీలర్ల సమ్మె

తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లాలో రేషన్​ డీలర్లు సమ్మె చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 8వ విడత రేషన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ration distribution stopped in guntur district
గుంటూరులో రేషన్ డీలర్ల సమ్మె

By

Published : Jul 20, 2020, 1:17 PM IST


కరోనా సమయంలో పేద వర్గాల వారి ఆకలి తీర్చటంలో, ప్రభుత్వ సాయాన్ని ప్రజలకు చేరవేయటంలో ముందు వరుసలో ఉండి పని చేస్తున్నా ప్రభుత్వం తమని గుర్తించటం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు శానిటైజర్లు కూడా పంపిణి చేయటం లేదని... ప్రభుత్వం నుంచి ఐదు విడతల కమిషన్ బకాయిలు రావాల్సి ఉన్నాయని వారు చెబుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి 8వ విడత రేషన్ పంపిణీని ఇవాళ నిలిపివేశారు.

కోవిడ్ పై పోరాడుతున్న వారిలో మేం కూడా ముందు వరుసలో ఉన్నాం. మొదట్లో బయోమెట్రిక్ విధానం తీసేసి రేషన్ పంపిణీకి అనుమతించారు. కానీ ఇపుడు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ప్రతి కార్డుదారుని వేలి ముద్రలు తీసుకోవాల్సి రావటంతో డీలర్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కర్నూలులో ఒకరు, గుంటూరులో ఇద్దరు డీలర్లు మరణించారు. మా ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలి. డీలర్లందరికీ కరోనా బీమా చేయాలి. అలాగే బకాయిలు చెల్లించాలి. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కేంద్రసాయం, రాష్ట్ర సాయం రెండూ ఒకేసారి ఇస్తున్నారు. ఏపీలో మాత్రం నెలకు మూడు విడతలుగా ఇవ్వాల్సి వస్తోంది. ఇది కరోనా వ్యాప్తికి దారితీస్తోంది.

-ప్రసాద్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు


రాష్ట్ర వ్యాప్తంగా 4కోట్ల మందికిపైగా ప్రజలకు మేం సంబంధాలు కలిగి ఉన్నాం. డీలర్లు చాలామంది కరోనా భారిన పడ్డారు. మొదట్లో శానిటైజర్లు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత అవి కూడా పంపిణీ చేయలేదు. కమిషన్ ఐదు విడతల బకాయి ఉంది. ఆ కమిషన్ కూడా మా బ్యాంకు అకౌంట్లో కాకుండా... మళ్లీ సరుకులు కొనాలనే డిమాండ్ పెడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. -సాగర్, రేషన్ డీలర్

ఇదీ చదవండి:

'కోర్టు ఆదేశాలతో ఎస్​ఈసీగా నన్ను పునర్నియమించండి'

ABOUT THE AUTHOR

...view details