ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎయిరిండియాకు వినియోగదారుల కమిషన్‌ షాక్.. ప్రయాణం రద్దయితే పరిహారం ఇవ్వాల్సిందే! - Compensation should canceled journey

Consumer Commission: ఓ వ్యక్తి హైదరాబాద్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు.. ఎయిర్​ ఇండియాలో రానుపోను ప్రయాణం కోసం మూడు విమాన టిక్కెట్లు బుక్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అతని తిరుగు ప్రయాణం రద్దయింది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ డబ్బులు చెల్లించేందుకు సదరు సంస్థ అంగీకరించింది. కానీ సొమ్మును రీఫండ్‌ చేయలేదు. దీంతో అతను వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్​ ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Consumer Commission
ఎయిర్‌ ఇండియాకు వినియోగదారుల కమిషన్‌ షాక్.. ప్రయాణం రద్దయితే పరిహారం ఇవ్వాల్సిందే!

By

Published : Jan 9, 2023, 3:09 PM IST

Consumer Commission: విమాన ప్రయాణం రద్దయిన నేపథ్యంలో టికెట్ల సొమ్ముకు 6 శాతం వడ్డీతో పాటు రూ.5 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలను 45 రోజుల్లో చెల్లించాలని ఎయిర్‌ ఇండియాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. హైదరాబాద్‌ నగరంలోని ఉప్పర్‌పల్లి గోల్డెన్‌ హైట్స్‌ కాలనీకి చెందిన గోపీక్రిష్ణ హైదరాబాద్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు రానుపోను ప్రయాణం కోసం రూ.2,47,778 వెచ్చించి 2020 అక్టోబరులో మూడు ఎయిర్‌ ఇండియా టిక్కెట్లు బుక్‌ చేశారు.

కొన్ని కారణాలతో తిరుగు ప్రయాణం రద్దు కావడంతో దానికి సంబంధించిన టికెట్‌ సొమ్ము తిరిగి చెల్లించేందుకు ప్రతివాద సంస్థ అంగీకరించింది. కానీ, సొమ్మును రీఫండ్‌ చేయలేదు. పలుమార్లు సంప్రదించినా స్పందించలేదు. ఆరు నెలల కాలయాపన తర్వాత డబ్బు రీఫండ్‌ అయినట్టు స్టేటస్‌లో చూపించింది. అయితే బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను గోపీక్రిష్ణ ఆశ్రయించారు. కరోనా కారణంగా ప్రయాణం రద్దయిందని రాతపూర్వక వివరణలో సంస్థ తెలిపింది. నిబంధనల ప్రకారం మూడు టికెట్లకు రూ.71,437 చెల్లిస్తామని ఫిర్యాదుదారుకు సమాచారమిచ్చినట్లు వివరించింది. దీనిపై విచారించిన కమిషన్‌ ఈ మొత్తానికి వడ్డీతో పాటు ప్రయాణికుడికి అసౌకర్యం కలిగించినందుకు పరిహారం, కేసు ఖర్చులను చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details