ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరికీ ఆదర్శం... ఈ ''జలదాత'' - గుంటూరు

మండే వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు... ప్రత్యక్షం అవుతోంది ఓ మొబైల్ చలివేంద్రం. తాను అనుభవించిన బాధ ఇతరులకు కలగకుండా... సొంత వాహనంపై గుంటూరు నగరంలోని తిరుగుతూ... వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజల దాహం తీరుస్తున్నాడు ఓ సామాన్య వ్యక్తి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనంపై తిరుగుతూ... ప్రజలకు చల్లని తాగునీరు అందిస్తున్నారు రాజమోహనరావు.

మొబైల్ చలివేంద్రం

By

Published : Apr 30, 2019, 11:51 AM IST

జొన్నలగడ్డ రాజమోహనరావు

గుంటూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు పాఠశాలల వద్ద జొన్నలగడ్డ రాజమోహనరావు ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్లుగా తన సొంత ఖర్చుతో... ద్విచక్రవాహనంపై తిరుగుతూ... దాహార్తులకు చల్లని నీరు అందిస్తున్నాడు. రాజమోహనరావు గుంటూరులోని ఓ గ్యాస్ కంపెనీలో మెకానిక్​గా పని చేస్తున్నాడు. తనకొచ్చే కొద్ది నగదుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై పలువురు ప్రభుత్వాధికారులు, నగరవాసులు రాజమోహనరావును అభినందిస్తున్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శమంటూ కొనియాడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details