ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి' - guntur district latest concern

డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అవమానపరిచారంటూ గుంటూరు జిల్లా గుళ్లపల్లిలో దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

protest in gullapalli
గుళ్లపల్లిలో దళిత సంఘాల నేతలు ఆందోళన

By

Published : Apr 24, 2021, 9:18 AM IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద జాతీయ రహదారిపై దళిత సంఘాల నేతలు రాస్తారోకో చేశారు. గుళ్లపళ్లి ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న డా. బీఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానిస్తూ.. గుర్తుతెలియని వ్యక్తులు వీడియోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలను చూసిన దళిత సంఘాల నాయకులు.. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ గుళ్లపల్లిలో ఆందోన చేశారు.

విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీచదవండి.

'మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకవస్తాం'

ABOUT THE AUTHOR

...view details