ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2020, 10:53 PM IST

ETV Bharat / state

నరసరావుపేటలో వార్డు సచివాలయం ఎదుట ఆందోళన

గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అందడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

protest at ward secretariat in Narasaraopet  guntur district
నరసరావుపేటలో వార్డు సచివాలయం ఎదుట ఆందోళన

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని 12వ వార్డు సచివాలయం ఎదుట మాల మహా నాడు ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకమూ వార్డులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు అందలేదని ఆరోపించారు. వార్డు అడ్మిన్, వాలంటీర్ కలిసి ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details