ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు: ప్రత్తిపాటి - prattipati pulllarao

చిలకలూరిపేటలో పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు జేఏసీ నేతల గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.

prattipati pulllarao
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Jan 20, 2020, 5:08 PM IST

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఒక నేరస్థుడు సీఎం కావడమే రాష్ట్ర ప్రజలకు పట్టిన శని అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పదివేల మంది జేఏసీ నాయకులకు నోటీసులు ఇచ్చిన చరిత్ర వైకాపా ప్రభుత్వానిదేనని.. దేవతల రాజధాని అమరావతి మార్చాలని ప్రయత్నం చేస్తున్న సీఎం మట్టి కొట్టుకుని పోతారని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతటి ప్రభుత్వాలు అయినా కూలిపోతాయన్నారు.

విశాఖలో ప్రభుత్వ భూములు కాజేయడానికి... ఉన్న భూముల ధర పెంచుకోవడానికి సీఎం జగన్ రాజధాని మార్పు చేపట్టారన్నారు. చంద్రబాబు కష్టాన్ని ప్రస్తుత సీఎం బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. రెండు కాన్వాయ్​లలో కేబినెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన మొదటి సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక బిల్లులను కృష్ణా, గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమోదిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రత్తిపాటి అన్నారు.

ఇవీ చదవండి...'రాజధానిపై రెఫరెండానికి ప్రభుత్వం సిద్ధమా?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details