ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిలోమీటర్ల మేర బారులుతీరిన మిర్చి లోడు ట్రాక్టర్లు - ఏపీలో కరోనా వార్తలు

లాక్​డౌన్ నుంచి రైతులకు కేంద్రప్రభుత్వం మినహాయింపు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మిర్చి పంటను కోల్డ్​ స్టోరేజీలో పెట్టేందుకు వచ్చిన రైతులను మేడికొండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ఉదయం నుంచి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు.

police stopped mirchi farmers in medikonduru
police stopped mirchi farmers in medikonduru

By

Published : Mar 28, 2020, 8:44 PM IST

ఈటీవీ భారత్​తో మిర్చి రైతులు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో మిరప లోడుతో ఉన్న ట్రాక్టర్లు బారులు తీరాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్​డౌన్ ప్రకటించగా... గుంటూరు మిర్చియార్డ్​లో కొనుగోలు నిలిపివేశారు. పంట అమ్ముకునే అవకాశం లేక కోల్డ్​స్టోరేజ్​లో నిల్వచేసేందుకు మిరప టిక్కీలను ట్రాక్టర్లు, ఆటోల్లో వేసుకుని గుంటూరు బయలుదేరారు. మేడికొండూరులో పోలీసులు వీరిని నిలిపివేశారు.

ఫలితంగా మిర్చి ట్రాక్టర్లు బారులు తీరాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను అమ్ముకునే అవకాశం లేదని మిర్చి రైతులు అన్నారు. ఇప్పుడు కోల్డ్​స్టోరేజ్​లో నిల్వ చేసేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చామని... తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంటను అమ్ముకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details