ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బట్టబయలైన ఇసుక దందా.. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

డంపింగ్ యార్డ్ అధికారులే కాసులకు కక్కుర్తి పడి ఇసుకను పక్కదారి పట్టిస్తున్న ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తనిఖీలు చేసి నిందితులను అరెస్టు చేశారు.

By

Published : May 27, 2020, 7:51 AM IST

guntur district
బట్టబయలైన ఇసుక దందా.. అరెస్టు చేసిన పోలీసులు

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు వివేక్ అనే బిల్డర్ తో కుమ్మక్కై.. రెండు లారీల్లో 36 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పెదకాకాని పోలీసులు పట్టుకున్నారు.

రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details