ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2021, 10:42 PM IST

ETV Bharat / state

ఇద్దరు దొంగలు అరెస్టు...6 బైక్​లు స్వాధీనం

గుంటూరు జిల్లాలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేయటం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.

Police arrested two people
ఇద్దరు దొంగలు అరెస్టు

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చిలకలూరిపేటకు చెందిన బాజీ పట్టణంలోనే ఓ హోటల్​లో పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలించడం ప్రారంభించారు. ఈక్రమంలో గుంటూరు నగరంలో 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం గుంటురులోని గౌరీ శంకర్ థియేటర్ వద్ద ద్విచక్ర వాహనం దొంగిలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బాజీకి నకరికల్లు మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన మాలిక్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు.. అతనితో కలసి దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలిక్​ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి మరో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

maoist : ఒడిశా డీజీపీ ఎదుట ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

ABOUT THE AUTHOR

...view details