ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 25, 2020, 12:40 PM IST

Updated : Sep 29, 2020, 1:18 PM IST

ETV Bharat / state

సత్తెనపల్లిలో భూవివాదం..ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులు

గుంటూరు జిల్లాలో భూ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి మరీ బాధితులకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడంటూ బాధితులు వాపోతున్నారు.

phone-threats-to-ruling-party-mla
స్థలం విషయంలో వైకాపా ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భూవివాదాలు తారాస్థాయికి చేరాయి. కొద్దిరోజుల నుంచి తమ భూమిని కొంతమంది ఆక్రమించి.. చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు భానుప్రసాద్ వాపోయాడు. అధికారులకు తమ గోడు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారంటున్నాడు. మాపైనే కేసు పెడతావా అంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి, మూడేం శ్రీనివాస రెడ్డిలు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు అంటున్నాడు.

ఎమ్మెల్యే పేరు చెప్పి..
సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు చెప్పి భయపెడుతున్నారని భానుప్రసాద్ భయాందోళనకు గురవుతున్నాడు. భూమి విషయమై భాదితుడు ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టారు. ఈలోపే అక్రమార్కులు ఎమ్మెల్యే పేరు చెప్పి ఫోన్​లో బెదిరించడం గమనార్హం. రేపు భూమి వద్దకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి..
అక్రమార్కులు చేసిన ఫోన్​కాల్స్​ని రికార్డు చేసిన బాధితుడు తనకు న్యాయం చేయాలని సత్తెనపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సత్తెనపల్లి సీఐ విజయచంద్ర దర్యాప్తు చేపట్టారు. రెవెన్యు అధికారుల సాయంతో అక్రమార్కులు తప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించారు. సత్తెనపల్లిలో ఉన్న భూమిని పిడుగురాళ్లలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

ఇవీ చూడండి...

కోడలే... కొడుకై అంత్యక్రియలు నిర్వహించింది

Last Updated : Sep 29, 2020, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details