ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామస్థుల పిర్యాదు... ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ - గుంటూరు  జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధి పట్టాడు. అతడితో విసిగి వేసారిన గ్రామస్తులు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. పాపం పండి... సస్పెన్షన్​కు గురయ్యాడు.

గ్రామస్థుల పిర్యాదుతో సస్పెండైన ప్రధానోపాధ్యాయుడు

By

Published : Jul 18, 2019, 10:58 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్​కు గురయ్యాడు.గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు పిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలో వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని, విద్యార్థులతో సిగరెట్లు తెప్పిస్తున్నారని అతనిపై అభియోగాలు ఉన్నాయి. స్వీపర్, మధ్యాహ్న భోజన పథకం నిర్వహకులను దుర్భాషలాడుతున్నాడని ఫిర్యాదు చేశారు. విచారించిన జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని... అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details