ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 8:55 AM IST

ETV Bharat / state

మంత్రి వచ్చి నెల రోజులు కాకముందే ఓటర్లందరీ ఫోన్​ నెంబర్లు ఎలా తెలిశాయి

Personal Data Theft in AP: మంత్రి విడదల రజని పేరుతో గుంటూరు నియోజకవర్గ ఓటర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు అందాయి. అయితే రజని చిలకలూరిపేట నుంచి గుంటూరుకి మారిన విషయం తెలిసిందే. ఆమె నియోజకవర్గానికి మారి నెల రోజులు కూడా కాకాముందే ఓటర్లందరీ ఫోన్​ నెంబర్లు తెలియడం ఎలా సాధ్యమని అనుమానాలు కలుగుతున్నాయి. వక్తిగత డేటాను వైఎస్సార్​సీపీ వాలంటీర్లతో చోరీ చేస్తోందని గతంలో జనసేనాని ఆరోపణలు ఈ ఘటనతో నిజమనే అనుమానాలు కలుగుతున్నాయి.

personal_data-_theft_in_ap
personal_data-_theft_in_ap

మంత్రి వచ్చి నెల రోజులు కాకముందే ఓటర్లందరీ ఫోన్​ నెంబర్లు ఎలా తెలిశాయి

Personal Data Theft in AP: రాష్ట్రంలోని ఓటర్ల సమాచారమంతా వైఎస్సార్​సీపీ నాయకుల వద్ద ఉందా అంటే అవుననే అనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ మంత్రి విడదల రజని పేరిట మెసేజ్‌లు రావడమే దానికి నిదర్శనం. రజని గుంటూరులో అడుగుపెట్టి నెల రోజులు కాక ముందే ఓటర్లందరి ఫోన్‌ నెంబర్లుకు సందేశాలు ఎలా పంపగలిగారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల వ్యక్తిగత వివరాలు అధికార పార్టీ నేతల వద్ద ఉన్నాయన్న పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు నిజమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

దుర్వినియోగానికి అస్కారముందన్న జనసేనాని : రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వాలంటీర్లు ద్వారా సేకరించి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చారని గతంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో ఆరోపించారు. ప్రజల డేటాను దుర్వినియోగం చేసేందుకు ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌ సహా పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ension in Rajini Tour: మైలవరంలో మంత్రి రజినిని అడ్డుకునేందుకు స్థానికుల యత్నం.. ఉద్రిక్తత

పవన్​ ఆరోపణలు నిజమనే తీరుగా : అధికార పార్టీ నేతలు మాత్రం పవన్​ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అయితే తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మంత్రి విడదల రజని పేరిట ఓటర్లందరికీ మెసేజ్‌లు వచ్చాయి. చిలకలూరి పేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారిన రజని ఇక్కడి ఓటర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపించారు. దీంతో పవన్‌ చేసిన ఆరోపణలకు నిజమేనని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

ప్రతి ఒక్కరికి మంత్రి పేరుతో సందేశాలు : వైఎస్సార్​సీపీ ఓటర్లకు మాత్రమే ఈ సందేశాలు పంపితే ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. కానీ నియోజకవర్గంలోని 2లక్షల పైగా ఉన్న ఓటర్లందరికీ ఈ శుభాకాంక్షల మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌ వచ్చిన విషయం తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు, సానుభూతిపరులు తమ పార్టీ వారికే చెప్పే క్రమంలో ఓటర్లందరికీ మంత్రి పేరుతో సందేశాలు వచ్చినట్లు గుర్తించారు.

వాలంటీర్​ వ్యవస్థను పావుగా వాడుకుంటున్న ప్రభుత్వం..!

వైఎస్సార్​సీపీ ప్రజల సమస్త డేటాని చోరి చేస్తోంది : మెసేజ్​లు కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన రజనీకి ఓటర్లందరి వివరాలు, ఫోన్‌ నెంబర్లు తెలియడం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్‌ వ్యవస్థతో వైఎస్సార్​సీపీ ప్రజల సమస్త డేటాని చోరీ చేస్తుందని ఆరోపణలు నిజం అవతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అనే వాదనలు వినపడుతున్నాయి.

అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details