ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్థరాత్రి చెట్టుకు నిప్పు.. పోలీసుల అదుపులో అనుమానితులు! - chadalavada aravind babu news

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో బొడ్డురాయి సెంటర్​లో ఉండే మహాలక్ష్మమ్మ చెట్టు కాలిపోయింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు చెట్టుకు నిప్పటించటంతో ఘటన జరిగింది.

People setting fire to a tree
అర్థరాత్రి చెట్టుకు నిప్పంటించిన వ్యక్తులు

By

Published : Mar 1, 2021, 4:34 PM IST

అర్థరాత్రి చెట్టుకు నిప్పంటించిన వ్యక్తులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో బొడ్డురాయి సెంటర్​లో ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టును తగులబెట్టారు. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అర్థరాత్రి పూట ఈ ఘటనకు పాల్పడ్డారు. గ్రామస్థులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంతోకాలంగా కొలుచుకుంటున్న మహాలక్ష్మమ్మ చెట్టు తగులబడి పోవడంతో స్థానికులు కలత చెందారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టుకు నిప్పంటించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జి చదలవాడ అరవింద్​ బాబు గ్రామానికి చేరుకుని.. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details