ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముంపు ప్రాంతాల్లో నంబూరు శంకరరావు పర్యటన

By

Published : Aug 17, 2019, 11:22 PM IST

గుంటూరు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు.

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో పులిచింతల జలాశయం వరద ప్రవాహానికి ముంపునకు గురైన ప్రాంతాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. పడవలో వెళ్లి రైతులను కలిసి నీట మునిగిన పంట పొలాలని పరిశీలించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వరద సహాయక చర్యలను పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్లో నంబూరు శంకరరావు పర్యటన

ABOUT THE AUTHOR

...view details