ఆంగ్లమాధ్యమంపై జనసేనాని తీవ్ర విమర్శలు తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని తాను ఉద్దేశపూర్వకంగానే అన్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ బాధపడిపోతున్నారని... ముందు సీఎం జగన్కు ఎలా మాట్లాడాలో చెప్పండని సూచించారు. విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటం తగదని వారించారు.
సంపాదన ఆగలేదుగా..!
భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేన పార్టీదని పవన్ స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణకు ఆంగ్లం రాకపోయినా సంపాదన ఆగలేదని ఎద్దేవా చేశారు. తెలుగు మాధ్యమంలో చదివే ఒక్క విద్యార్థి ఉన్నా.. ఆ పాఠశాలలో మాతృభాషలోనే బోధించాలని జనసేనాని డిమాండ్ చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై వైకాపా నేతలకు ఏమాత్రం గౌరవం లేదని ఆయన విమర్శించారు. తెలుగులో ఉన్న లక్షల పుస్తకాల జ్ఞానం విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:
'సీఎంను ఎలా పిలవాలో వైకాపా ఎమ్మెల్యేలు తీర్మానించండి'