గుంటూరు జిల్లాలో ఈ నెల 13 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్నాటి యుద్ధం నేపథ్యంగా అసువులు బాసిన వీరులను ఆరాధిస్తూ కారంపూడిలో 5 రోజులపాటు జరగనున్న ఉత్సవాల తేదీలను పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవయ్య ప్రకటించారు. డిసెంబర్ 13న రాచగావు కార్యక్రమం, 14న రాయబారం, 15న మందపోరు, 16న కోడిపోరు, 17న కల్లిపాడు పేర్లతో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
13వ తేదీ నుంచి పల్నాటి ఉత్సవాలు - పల్నాటి ఉత్సవాలు న్యూస్
గుంటూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ నుంచి ఐదు రోజులపాటు పల్నాటి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన వీరులను ఆరాధిస్తూ కారంపూడిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
palnati ustavas