ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐటీఐ విద్యాలయాల్లో ఆన్​లైన్ పరీక్షను ఎత్తివేయాలి' - Online exams in ITI schools must be lifted

ఐటీఐ విద్యాలయాల్లో ప్రధాన పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించడం సమంజసం కాదని... అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Online exams in ITI schools must be lifted
ఐటీఐ విద్యాలయాల్లో ఆన్​లైన్ పరీక్షను ఎత్తివేయాలి

By

Published : Dec 10, 2019, 3:21 PM IST

ఐటీఐ విద్యాలయాల్లో ఆన్​లైన్​ పరీక్ష విధానాన్ని వ్యతిరేకిస్తూ... గుంటూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేశపరీక్షలకు ఆన్​లైన్ పరీక్ష విధానం సహేతుకమని... ప్రధాన పరీక్షలను ఆన్​లైన్ చేయడం సమంజసం కాదని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం... (ఏఐడీఎస్​వో) రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు అభిప్రాయపడ్డారు. ఐటీఐ విద్యాలయాల్లో నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా విద్యనభ్యసిస్తారని... ఆంగ్లంలో ఉండే ఆన్​లైన్ పరీక్షను రాయడం కష్టసాధ్యమన్నారు. విద్యార్థులకు అప్రెంటీస్ అవకాశాలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఈ ఆన్​లైన్ పరీక్ష విధానాన్ని ఎత్తివేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని బసవరాజు హెచ్చరించారు.

ఐటీఐ విద్యాలయాల్లో ఆన్​లైన్ పరీక్షను ఎత్తివేయాలని విద్యార్థుల ధర్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details