ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో 117 మందికి కరోనా పాజిటివ్

గుంటూరులో కొత్తగా 117 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 72 వేల 178కు చేరింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో.. జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.

By

Published : Nov 24, 2020, 10:05 AM IST

Guntur has the second highest number of deaths due to the virus
వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్యలో గుంటూరు రెండోస్థానం

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 117 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 72వేల 178కు చేరింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నుంచి 37 కేసులు నమోదయ్యాయి.

తెనాలి నుంచి 15 కేసులు, తాడేపల్లిలో 13 కేసులు, ఫిరంగిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 645కి పెరిగింది. అత్యధికంగా మృతి చెందిన వారి సంఖ్యలో జిల్లా రెండో స్థానంలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details