ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 18, 2021, 12:28 PM IST

Updated : Oct 18, 2021, 4:11 PM IST

ETV Bharat / state

Complaint: ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం

old women complaint to RDO regarding her land
నరసారావుపేట ఆర్టీవోకు ఫిర్యాదు చేస్తున్న వృద్ధురాలు

12:25 October 18

రూ.20 కోట్లు విలువ చేసే 9 ఎకరాల పొలం మార్చుకున్నారని ఆరోపణ

నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆస్తి లాక్కున్నారు.. ఆర్డీవోకు వృద్ధురాలి ఫిర్యాదు

  
బతికున్న వృద్ధురాలిని చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి.. ఆమెకున్న సుమారు రూ.20కోట్ల ఆస్తిని కాజేసిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఇస్సపాలెంలో జరిగింది. 

ఇస్సపాలెంకు చెందిన బండ్లమూరి వెంకాయమ్మ (90) అనే వృద్ధురాలికి(old women).. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఆస్తి కాజేసేందుకు.. వరుసకు ఆమెకు మనవడైన బండ్లమూరి కోటయ్య అనే వ్యక్తి.. 2018లో వెంకాయమ్మ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించాడు. 2020లో వృద్ధురాలి ఆస్తిని.. తప్పుడు ధ్రువపత్రాలతో కోటయ్య తన పేరుపైకి మార్చుకున్నట్లు.. వెంకాయమ్మ నరసరావుపేట ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.  

ఇదీ చదవండి: 

రీ రిజిస్ట్రేషన్‌, పన్ను చెల్లింపు యాప్​పై సందిగ్ధత

Last Updated : Oct 18, 2021, 4:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details