ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యం కోసం వెళ్లి.. ఓపీ రాయించుకునే క్యూలోనే కన్నుమూశాడు..! - గుంటూరు నేర వార్తలు

వైద్యం కోసం వెళ్లిన ఓ వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన రేపల్లె సామాజిక వైద్య కేంద్రంలో జరిగింది. ఓపీ రాయించుకునేందుకు వరుసలో నిల్చున్న అతను.. ఒక్కసారిగా కుప్పకూలాడు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు.

men died
men died

By

Published : May 4, 2021, 6:54 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె సామాజిక వైద్య కేంద్రానికి వైద్యం కోసం వెళ్లిన ఓ వృద్దుడు మృతి చెందాడు. రేపల్లె మండలం పోటు మెరక గ్రామానికి చెందిన ఏడుకొండలు (60) అనారోగ్యంతో చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. ఓపీ రాయించుకునెందుకు క్యూలో నిలబడ్డాడు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలుచున్న చోటనే కుప్పకూలి పోయాడు. గమనించిన వైద్యులు వెంటనే పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులకు సమాచారాన్ని తెలియజేశారు. అదే ఆసుపత్రిలో కొవిడ్​తో ఓ మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details