ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Motion of no confidence: ఏపీఎన్జీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడిపై.. అవిశ్వాస తీర్మానం - అవిశ్వాస తీర్మానం వార్తలు

No Confidence Motion On APNGO Guntur President: గుంటూరు జిల్లా ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు రామిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయటంతో ఆయన పదవిని కోల్పోయారు. నూతన అధ్యక్షుడిగా ఘంటసాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

ఏపీఎన్జీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం
ఏపీఎన్జీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం

By

Published : Dec 5, 2021, 4:30 PM IST

No Confidence Motion: గుంటూరు జిల్లా ఏపీఎన్జీవో కార్యవర్గంలో విభేదాలు పొడచూపాయి. ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించిన పోటీ వర్గం ప్రతినిధులు.. అధ్యక్షుడిగా ఉన్న రామిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు రామిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయటంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు.

అదే సమయంలో ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఘంటసాల శ్రీనివాసరావును.. నూతన అధ్యక్షుడిగా ఎనుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న సతీశ్​ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

ఏపీఎన్జీవో సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడతామని స్పష్టం చేశారు. పీఆర్‌సీ నివేదికను వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Govt Employees association demands to solve PRC issue: పీఆర్సీ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతాం: ఆస్కార్‌రావు

ABOUT THE AUTHOR

...view details