ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ కమిటీ అలా చెప్పలేదు: ఎంవీఎస్ నాగిరెడ్డి - ఎంవీఎస్ నాగిరెడ్డి వార్తలు

మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తొలగించాల్సిందిగా ఏ కమిటీ చెప్పలేదని వెల్లడించారు.

'No committee has said to remove the capital from Amravati' says nagireddy
'No committee has said to remove the capital from Amravati' says nagireddy

By

Published : Jan 11, 2020, 12:51 AM IST

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయబోదని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధానిని తొలగించాల్సిందిగా ఏ కమిటీ చెప్పలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు. జీఎన్ రావు కమిటీ, బీసీజీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించిందని అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధానికి సంబంధించి రైతులు తమకున్న అనుమానాలను, సందేహాలను ఈ కమిటీకి విజ్ఞాపనల ద్వారా అందించాలన్నారు.

మీడియా సమావేశంలో ఎంవీఎస్ నాగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details