ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 8:59 AM IST

Updated : Oct 10, 2023, 9:37 AM IST

ETV Bharat / state

New Collectorates Construction in AP: ఎన్నికల ముందు కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై వైసీపీ సర్కార్ దృష్టి.. ఇప్పుడు గుర్తొచ్చాయా జగన్ సారూ..?

New Collectorates Construction in AP: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా.. ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. ఇంత కాలం కలెక్టరేట్ల నిర్మాణాలను పట్టించుకోని సీఎం జగన్.. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ.. వాటిని తెరపైకి తెచ్చారు. మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టాము అని ఆర్భాటంగా ప్రచారం చేసుకునేందుకే హడావుడి చేస్తున్నారు. త్వరలో ఒకటి, రెండు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మమ అనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

New_Collectorates_Construction_in_AP
New_Collectorates_Construction_in_AP

New Collectorates Construction in AP: ఎన్నికల ముందు కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై వైసీపీ సర్కార్ దృష్టి.. ఇప్పుడు గుర్తొచ్చాయా జగన్ సారూ..?

New Collectorates Construction in AP: గతేడాది ఏప్రిల్‌ 4న రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. హడావుడిగా వీటిని తీసుకురావడంతో.. కలెక్టరేట్లను ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, అతిథిగృహాలు, ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసి.., చాలీచాలని వసతులతో నెట్టుకొస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర దాటినా.., ఇంతవరకు నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆగమేఘాలపై కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీ చేయాలంటూ నానా హంగామా చేస్తుంది. తొలివిడతలో మన్యం పార్వతీపురం, పాడేరు, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, పుట్టపర్తి, నంద్యాల కలెక్టరేట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

YCP Govt focus on New Collectorates Construction Before Election: మొదటగా ఏడు జిల్లాల్లో కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేసినప్పటికీ.. వీటిలో రెండు చోట్ల మాత్రమే భూములు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. పార్వతీపురంలోని అడ్డాపుశిల గ్రామంలో 60 ఎకరాలు కేటాయించగా.., అదంతా కొండలా ఉండటంతో నిర్మాణం అసాధ్యమని తేల్చేశారు. పాడేరులోని తలారిసింగి వద్ద 10 ఎకరాలు కేటాయించగా, మరో 5 ఎకరాలు కావాలని కోరుతున్నారు. నరసరావుపేటలోని లింగమంగుంట్లలో 27.49 ఎకరాలు ఎంపికచేసినా, అదనంగా మరికొంత భూమి అడుగుతున్నారు.

Negligence on VMC New Building Construction: చంద్రబాబు ప్రారంభించారని జగన్ సర్కారు వివక్ష.. పిల్లర్ల దశలోనే వీఎంసీ భవనం

AP New Collectorates Construction: రాయచోటిలోని మాసాపేటలో కేటాయించిన 40 ఎకరాల్లోనూ రాళ్లగుట్టలున్నాయి. వాటిని తొలగించి చదును చేయడంలో ఆలస్యం కానుంది. పుట్టపర్తిలోని కప్పలబండలో 15.72 ఎకరాలు కేటాయించినా.., అదంతా ఒకే చోట కాకుండా వంపులు తిరిగి ముక్కలుముక్కలుగా ఉన్నాయి. భీమవరంలో గునుపూడి వద్ద మార్కెట్‌యార్డుకు చెందిన 20 ఎకరాలు, నంద్యాలలో నూనేపల్లిలో కేటాయించిన 10 ఎకరాలు మాత్రమే నిర్మాణాలకు అనువుగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోని అనకాపల్లి, రాజమహేంద్రవరం, అమలాపురంలో స్థలాల ఎంపిక పూర్తి కాలేదు.

New Collectorates: బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనం, విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో కలెక్టరేట్లు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతానికి అక్కడ కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై వైసీపీ సర్కారు దృష్టి పెట్టలేదు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర 30 శాఖలకు చెందిన కార్యాలయాలతో కలిపి ఒక్కో కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సగటున 100 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా. దీంతో ముందుగా నంద్యాల, భీమవరంలో కలెక్టరేట్ల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేసి, అక్కడ సీఎం జగన్‌ చేతులమీదుగా వీలైనంత త్వరగా శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

AP Govt Did Not Allocate Funds to Barrages: ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలు.. అయినా, బ్యారేజీల నిర్మాణాలపై నిర్లక్ష్యం

CM Jagan Focus on New Collectorates Construction Before Election: గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లలో గుంతలు పూడ్చిన గుత్తేదారులకే.. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల మేర బకాయిలు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఇపుడు ఒక్కో కలెక్టరేట్‌కు 100 కోట్ల రూపాయల మేర వెచ్చిస్తుందంటే.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అనేది సీఎం జగన్‌కే తెలియాలని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కలెక్టరేట్లను ఎన్నికల స్టంట్‌గా వాడుకునేందుకే నాటకాలాడుతున్నారని విమర్శిస్తున్నాయి.

కొత్త కలెక్టరేట్లకు భూముల వివరాల సేకరణ

Last Updated : Oct 10, 2023, 9:37 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details