ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు.. 1111 కు పెరిగిన బాధితులు

గుంటూరు జిల్లాలో కొవిడ్-19 విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా మరో 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 1111కు చేరింది.

By

Published : Jun 25, 2020, 7:36 PM IST

Updated : Jun 26, 2020, 7:12 AM IST

new 76 corona cases raised in guntur district
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,111 కు చేరింది. కొత్తగా గుంటూరులో 49 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాడేపల్లిలో 5, తెనాలిలో 4, తేలప్రోలులో 4 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మంగళగిరి, యర్రబాలెం, ఉండవల్లి లో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

చేబ్రోలు, తాడికొండ, పెదనందిపాడు, అమరావతి, విజయపురిసౌత్, పెదకాకాని, పొన్నూరు, రెయిన్ ట్రీ పార్క్ లలో ఒక్కొక్కరికీ కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేసింది. జిల్లాలో ఇవాళ ఇద్దరు.. వైరస్ కారణంగా మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 16కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 577 మంది డిశ్ఛార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Jun 26, 2020, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details