ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramya Murder Case: ఈ నెల 24న రాష్ట్రానికి జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం

By

Published : Aug 21, 2021, 8:00 PM IST

Updated : Aug 21, 2021, 8:33 PM IST

Ramya Murder Case
Ramya Murder Case

19:56 August 21

National SC commission

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్  బృందం రాష్ట్రానికి రానుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి గుంటూరుకు రానున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందింది.

ఈనెల 24వ తేది ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలిస్తారు. ఆ తర్వాత బాధిత కుటుంబసభ్యులను కలిసి మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి:

అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్!

Last Updated : Aug 21, 2021, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details