ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 15, 2020, 6:54 AM IST

ETV Bharat / state

'భవిష్యత్తులో రాష్ట్రంలో మతఘర్షణలు వచ్చినా ఆశ్చర్యపడొద్దు'

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా కార్యకర్తల సమావేశం జరిగింది. భవిష్యత్​లో రాష్ట్రంలో మతఘర్షణలు తలెత్తినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ ఇంఛార్జీ అరవిందబాబు అన్నారు.

Narasaraupeta TDP Incharge Chadalawada Aravindababu fire on YCP government
నరసరావుపేట తెదేపా ఇంఛార్జీ చదలవాడ అరవిందబాబు

రాబోయే కాలంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మతకక్షలు తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇంఛార్జీ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అభిమానుల మనోభావాలను దెబ్బతీసేందుకే నాయకుల విగ్రహాలను తొలగించే ప్రక్రియను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిందని అరవిందబాబు ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details