గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపటినుంచి లాక్ డౌన్లో సడలింపులు చేయనున్నట్లు ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని వార్డులను 2 భాగాలుగా విభజించి ఆయా వార్డులకు రోజు మార్చి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 6వ వార్డు నుంచి 24వ వార్డు వరకు ఒక భాగం కాగా.. 1 నుంచి 5, 25 నుంచి 34 వార్డుల వరకూ 2వ భాగంగా నిర్ణయించామన్నారు.
నరసరావుపేటలో రేపటినుంచి లాక్ డౌన్ సడలింపులు - నరసరావుపేటలో లాక్ డౌన్ సడలింపులు తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపటి నుంచి లాక్ డౌన్లో సడలింపులు చేయనున్నారు. పట్టణాన్ని రెండు భాగాలుగా విభజించి నిత్యావసరాల కోసం నిర్ణీత సమయంలో ప్రజలు బయటకు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు.
![నరసరావుపేటలో రేపటినుంచి లాక్ డౌన్ సడలింపులు narasaraopet lockdown relaxation from may 18](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238662-225-7238662-1589725541250.jpg)
నరసరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు
ఒకటవ భాగం ప్రజలు 18వ తేదీ, రెండో భాగం ప్రజలు 19వ తేదీ నిత్యావసరాలకు బయటకు రావాలని ఆయన కోరారు. ఇలా 4 రోజులు ఉంటుందని ఆ తరువాత లాక్ డౌన్ సడలింపుపై మరలా వివరణ ఇస్తామని ఆర్డీఓ తెలిపారు. క్లస్టర్ జోన్లలోని ప్రజలకు లాక్ డౌన్ సడలింపు లేదని ఆయా వార్డుల్లోని ప్రజలకు ఎప్పటిలాగే నిత్యావసరాలు ఇళ్లకే పంపుతామని అన్నారు.
ఇవీ చదవండి.. 'ప్రభుత్వం అతనికి క్షమాపణ చెప్పాలి'