ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి ఎదుట సిబ్బంది ఆందోళన - guntur latest news

నరసరావుపేట కొవిడ్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, కాంపౌండర్లు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

నరసరావుపేట ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆందోళన
నరసరావుపేట ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆందోళన

By

Published : Jun 15, 2021, 4:19 PM IST

నరసరావుపేటలోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలలో సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. వైద్యశాలలో జూనియర్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, కాంపౌండర్లు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. వైద్యశాలలో నిరంతరం శ్రమిస్తూ కోవిడ్ వైద్యం అందిస్తున్నా తమకు నామమాత్రపు వేతనాలు ఇస్తున్నారని అవి కూడా సమయానికి ఇవ్వడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇచ్చే వేతనాలను పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని వైద్యశాల సిబ్బంది డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details