ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేదలకు సరకులు పంచిన నరసరావుపేట ఎంపీ

సామాజిక సేవలో విజ్ఞాన్ యూనివర్సిటీ ముందంజలో ఉంటుందని యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్,​ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. యూనివర్సిటీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుపేదలకు సరకులు పంపిణీ చేశారు.

By

Published : May 13, 2020, 6:27 PM IST

Published : May 13, 2020, 6:27 PM IST

Narasaraoopete MP distributed essential goods
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నరసరావుపేట ఎంపీ

లాక్ డౌన్ ఎత్తివేసినా... కరోనా ప్రభావం మరో 2, 3 నెలలు ఉండే అవకాశం ఉందన్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుపేదలకు ఆయన సరకులు పంచారు. కొద్ది రోజుల్లో యూనివర్సిటీని తెరిచి అందరికీ పనులు కల్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details