ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులైన వారికి మరో 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ' - Gopira Reddy Srinivasa Reddy latest comments

రాష్ట్ర ప్రభుత్వం జులై 8న పేదప్రజలకు అందజేసే ఇళ్లస్థలాల్లో అర్హుల పేర్లు లేకుంటే మళ్లీ నమోదు చేసుకోవచ్చని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

narasaraoopeta-mla-gopi-reddy-srinivasa-reddy
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : Jul 6, 2020, 11:11 AM IST

గుంటూరు జిల్లా నర్సరావుపేట పరిధిలో దాదాపు 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేపడుతోందని.. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా ఇళ్లస్థలాలకు లంచమడిగితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

కొందరు వాలంటీర్లు ఇళ్ల స్థలాలకు లంచాలు తీసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైనా అర్హులు ఇళ్లస్థలాలకు నమోదు చేసుకొని వారికి అందకపోతే అలాంటి వారు జులై 8 తర్వాత కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. వారికి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details