ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2022, 8:53 PM IST

ETV Bharat / state

రాజధాని రోడ్ల దుస్థితిపై ఆర్.అండ్.బీ కార్యదర్శికి లోకేష్ లేఖ...

TDP leader Nara Lokesh on roads issue: రాజధానిలోని రోడ్ల దుస్థితిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అమరావతిలో రహదారులపై దృష్టి సారించాలని ఆర్​అండ్​బీ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి వెళ్లే రహదారుల దారుణమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నారా లోకేష్
TDP leader Nara Lokesh

Nara Lokesh on roads issue: రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టి సారించాలని ఆర్​అండ్​బీ ముఖ్య కార్యదర్శికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. ఎస్​ఆర్​ఎం విశ్వవిద్యాలయానికి వెళ్లే రహదారి మరీ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున తక్షణం మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక, సాంస్కృతిక మార్పులకు రహదారుల అభివృద్ధి ఎంతో కీలకమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 3ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి వెళ్లే రహదారుల దారుణమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా ఆర్.అండ్.బీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

2017లో స్థాపించిన యూనివర్సిటీకి వెళ్లే రోడ్ల దయనీయ స్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారుల దుస్థితిపై తనకు అనేక ఫిర్యాదులు అందచేశారని.. ఆ మార్గంలో రవాణా పెను సవాలుగా మారిందని, వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు, వాహనాలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది అమూల్యమైన సమయం వృధా అవుతోందన్నారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details