ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమంటే.. రంగులేసినంత సులభం కాదు' - apollo tyres in ap

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంత సులభమైన పనికాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రికార్డు సమయంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత తెదేపా ప్రభుత్వానిదే అని అన్నారు.

nara lokesh on apollp tyres
వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్

By

Published : Jun 26, 2020, 3:00 PM IST

రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడమంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత సులభం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రికార్డు సమయంలో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలన్నా తెదేపా ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 3,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి.. తొలి టైర్​ని విడుదల చేసిన అపోలో యాజమాన్యాన్ని లోకేశ్‌ అభినందించారు. కంపెనీ మరింత వృద్ధిచెంది రాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని లోకేశ్ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details