ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 3:07 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: లోకేశ్

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వర్ణకారుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు.

Nara Lokesh Fires Jagan's Government
నారా లోకేశ్

నారా లోకేశ్

డీజీపీ రెండుసార్లు హైకోర్టు గడప తొక్కారంటేనే రాష్ట్రంలో శాంత్రిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. దాడులను ప్రోత్సహించేవారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... లేనిపక్షంలో తామే ఆ సంఘం నేతలతో కలిసి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details