ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన - MUSLIMS AGAINST NRC CAA

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఓ వైపు భాజపా ప్రభుత్వం చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆందోళనలు ఆగటం లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేపట్టారు.

musilims protest against NRC CAA
నిరసన చేస్తున్న ముస్లీంలు

By

Published : Jan 6, 2020, 7:36 PM IST

పౌరసత్వ సమరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన

రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లింలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేశారు. ఈ నిరసనకు వామపక్షాలు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కంభం మండలంలో ఎన్ఆర్​సీ ,సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్​ విగ్రహం కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కులాలకు చెందిన మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details